(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): వేదాంత లిమిటెడ్ మైనింగ్ కంపెనీ తాజాగా రాజకీయ పార్టీలకు రూ.155 కోట్లు విరాళంగా చెల్లించడం చర్చనీయాంశమైంది. గత ఏడాది రూ.123 కోట్లు విరాళాలిస్తే, ఈ ఏడాది ఆ మొత్తాన్ని పెంచింది.
ఐదేండ్లలో ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వేదాంత కంపెనీ మొత్తం రూ.457 కోట్లు విరాళాలుగా సమర్పించుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేపింది. ఎలక్టోరల్ బాండ్స్ విరాళాలు అత్యధికంగా అధికార బీజేపీకి చేరుతున్న సంగతి తెలిసిందే. వేదాంత కంపెనీకి ఈ మధ్య కాలంలో కేంద్రం నుంచి పలు లైసెన్స్లు దక్కాయి. పెద్ద మొత్తంలో రుణాలు ఉన్నా,విరాళాలు అందజేయటంపై ఆరోపణలు వెలువడుతున్నాయి.