బెలగావి: కర్ణాటక అసెంబ్లీలో అధికార భారతీయ జనతాపార్టీ.. వీడీ సావర్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించింది. అయితే, దీనిపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా బీజేపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. సావర్కర్ చిత్రపటాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
అంతేగాక, అసెంబ్లీలో వాల్మీకి, బసవన్న, కనకదాస, బీఆర్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహనీయులను చిత్రపటాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్కు లేఖ రాశారు. అసెంబ్లీలో వారి అవినీతిపై చర్చ జరగకుండా ఉండేందుకే బీజేపీ అసెంబ్లీలో సావర్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి వివాదం రాజేసిందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.