హుబ్లీ (కర్ణాటక), జూలై 5: ప్రముఖ వాస్తు నిపుణుడు చంద్రశేఖర్ గురూజీ కర్ణాటకలో దారుణ హత్యకు గురయ్యారు. హుబ్లీలోని ఓ హోటల్ రిసెప్షన్ వద్ద మంగళవారం ఇద్దరు వ్యక్తులు ఆయనను కత్తులతో పొడిచి చంపినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ విషయం తెలిసిన వెంటనే హుబ్లీ పోలీస్ కమిషనర్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఈ హత్యకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో హంతకుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు.
బాగల్కోట్కు చెందిన చంద్రశేఖర్ గురుజీ తొలుత కాంట్రాక్టర్గా తన కెరీర్ను ప్రారంభించారు. అనంతరం ముంబైలో ఉద్యోగం లభించడంతో అక్కడే స్థిరపడిన చంద్రశేఖర్ గురూజీ.. తర్వాత వాస్తు వృత్తిని చేపట్టినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. చంద్రశేఖర్ కుటుంబానికి చెందిన ఓ చిన్నారి మూడు రోజుల క్రితం హుబ్లీలో మరణించడంతో ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఇక్కడికి వచ్చారు.