వారణాసి, జూలై 3: ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు వారణాసి మున్సిపాలిటీ చర్యలు చేపట్టింది. ఇక నుంచి పుణ్యక్షేత్రం పరిసరాల్లో ప్లాస్టిక్ సంబంధిత వస్తువులు కొనుగోలు చేసే భక్తులు రూ.50 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి.
ప్లాస్టిక్ నీళ్ల బాటిల్, ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలు తదితర వస్తువులు కొనుగోలు చేసేవారు వాటి ధరతో పాటు సెక్యూరిటీ డిపాజిట్ను కూడా విధిగా చెల్లించాలి. సదరు వస్తువును వినియోగించుకున్న తర్వాత ప్లాస్టిక్ కవర్, బాటిల్ను ఆయా దుకాణాల్లో అందించి సెక్యూరిటీ డిపాజిట్ను తిరిగి పొందవచ్చు.