Vande Bharat | ఇండోర్-నాగ్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. కోచ్ అద్దాలు పగిలిపోవడంతో కోచ్లోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చింతామన్ స్టేషన్-ఉజ్జయిని మధ్య దాడి ఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రయాణికుల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, దాడి ఘటన నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తిపై ఆర్పీఎఫ్ కేసు నమోదు చేసింది. ఇండోర్ నుంచి భోపాల్ మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఐదు రోజుల కిందట ఇండోర్ నుంచి నాగ్పూర్కు మార్చారు.
అయితే, గత రెండురోజులుగా ఈ రైలుపై రాళ్ల దాడి జరుగుతున్నది. ఇండోర్-భోపాల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ (రైలు నెం. 20911)ను అక్టోబర్ 9 నుంచి నాగ్పూర్ వరకు పొడిగించారు. ఉజ్జయిని సెక్షన్లోని చింతామన్ స్టేషన్, ఉజ్జయిని మధ్య ఉదయం 6.50 గంటలకు రైలుపై రాళ్లు విసిరారు. దీంతో కోచ్ నంబర్ సీ-6, సీ-7ల అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనతో రైలులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తిపై ఆర్పీఎఫ్ కేసు నమోదు చేసింది.