సాధారణంగా రైలు ఢీకొడితే అవతలివైపు ఎవరున్నా ఎగిరి అర కిలోమీటర్ ఆవల పడతారు. కానీ, బర్రెలు ఢీకొట్టినందుకే వందే భారత్ రైలు ముందు పార్టు ఊడిపోయింది. ఇంజిన్ ముందు భాగం పాడైపోయింది. ముంబై నుంచి గాంధీనగర్కు వెళ్తుండగా గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది.
ప్రయాణికులెవరూ గాయపడలేదు. కాగా, ఘటనపై నెటిజన్లు మోదీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. బర్రెలు ఢీకొడితేనే రైలు పార్టులు ఊడిపోవటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.