కత్రా : జమ్మూకశ్మీర్లోని శ్రీమాతా వైష్ణోదేవి యూనివర్సిటీకి చెందిన 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో అధికారులు యూనివర్సిటీని మూసివేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు యూనివర్సిటీని మూసే ఉంటుందని స్పష్టం చేశారు. డిసెంబర్ 31న, జనవరి 1న వైష్ణోదేవి విశ్వవిద్యాలయ క్యాంపస్లో నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో 13 మంది విద్యార్థులకు పాజిటివ్గా తేలింది. ఈ క్రమంలో విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని ఉత్తర్వులు వెలువడే వరకు క్యాంపస్ను మూసివేయాలని రియాసీ జిల్లా మేజిస్ట్రేట్ చరణ్దీప్ సింగ్ యూనివర్సిటీ యాజమాన్యాన్ని ఆదేశించారు.