షెహరాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని షెహరాన్పూర్లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఒకవేళ యూపీలో వారసత్వ పార్టీలు అధికారంలో ఉంటే అప్పుడు వ్యాక్సిన్లను వీధుల్లో అమ్మేవారని ఆరోపించారు. యూపీలో బీజేపీ ప్రభుత్వం చాలా అవసరమని ఆయన అన్నారు. యూపీని అభివృద్ధి చేసేవారికే ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించారని, అల్లర్లు లేకుండా చూసే ప్రభుత్వాన్నే ఎన్నుకుంటారని, ఆడవాళ్లుకు ధైర్యాన్ని ఇచ్చే వారికి, నేరస్థులను జైళ్లలో పెట్టేవాళ్లకు మాత్రమే ఓటు వేస్తారని ప్రధాని అన్నారు. సమాజ్వాదీతో పాటు ఇతర విపక్షాలను టార్గెట్ చేసిన మోదీ.. వారసత్వ పార్టీలు అధికారంలో ఉంటే, వ్యాక్సిన్లను రోడ్లపై అమ్మేవారని, ప్రజల జీవితాలతో ఆడుకునేవారన్నారు.