నల్లగొండ : అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లను నల్లగొండ పోలీసులు అరెస్టు చేశారు. ఏటీఎం కార్డు క్లోనింగ్ చేస్తున్న ముఠా సభ్యులు ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. స్మార్ట్ మాగ్నెట్ రీడర్ మిషన్లతో డమ్మీ ఏటీఎం కార్డులు తయారీ చేసి ఖాతాలో డబ్బు మాయం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 15 నేరాలకు పాల్పడినట్లుగా సమాచారం. నిందితుల వద్ద నుండి 3 MSR మిషన్లు, ల్యాప్టాప్, బైక్, నకిలీ ఏటీఎం కార్డులు, విత్ డ్రా చేసిన డబ్బులు రూ. 5 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.