న్యూఢిల్లీ, డిసెంబర్ 26: జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 15 నుంచి 18 ఏండ్ల వయస్సు వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రస్తుతం భారత్ బయోటెక్కు చెందిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ మాత్రమే అందుబాటులో ఉన్నదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా చిన్నారులపై జరిపిన క్లినికల్ ట్రయల్స్లో కొవాగ్జిన్ అంచనాకు మించి రోగనిరోధక ప్రతిస్పందనను చూపిందని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ చైర్మన్ డాక్టర్ ఎన్కే ఆరోరా పేర్కొన్నారు.