న్యూఢిల్లీ: రైల్వే శాఖలో 2,98,428 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. వీటిలో ప్రస్తుతం 1,40,713 ఖాళీల భర్తీ వివిధ దశల్లో ఉన్నదని తెలిపారు. ఖాళీల భర్తీని వేగవంతం చేస్తున్నట్టు వెల్లడించారు. బుధవారం లోక్సభలో రైల్వే పద్దులపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ ‘రైల్వేలో ఉద్యోగాల నియామకాలపై నిషేధం లేదు. ఖాళీల భర్తీ అనేది నిరంతర ప్రక్రియ.. కాబట్టి ఖాళీల భర్తీకి ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం లేదు. అలాగే రైల్వేను ప్రైవేటీకరణ చేసే ఆలోచన లేదు. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఏదో ఊహించుకుంటున్నాయి’ అని పేర్కొన్నారు. రాజధాని రైళ్లను గంటకు 200 కిలోమీటర్ల వేగంతో నడుపాలన్న ఆలోచనలుగానీ, ప్రతిపాదనలుగానీ ప్రస్తుతానికి లేవని వైష్ణవ్
తెలిపారు.