న్యూఢిల్లీ: కైలాస్ మానస సరోవర్ యాత్రను తిరిగి పునరుద్ధరించేందుకు సాధ్యాసాధ్యాల్ని ఆలోచిస్తున్నట్టు ఉత్తరాఖండ్ అధికారులు మంగళవారం వెల్లడించారు. భూమిపై పరమ శివుడి ఆవాసం..కైలాస పర్వతంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసం. ఏటా వేలాది మంది మానస సరోవర్ యాత్రను చేపడుతుంటారు.
యాత్రికులు భూటాన్లోకి అడుగుపెట్టాలంటే లిపులేఖ్ పాస్ ఒక్కటే మార్గం. చివరిసారిగా 2019లో ఈ లిపులేఖ్ పాస్ గుండా భక్తుల యాత్ర కొనసాగింది. అయితే కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో ఈ మార్గాన్ని 2020లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం మూసేసింది. పాత లిపులేఖ్ శిఖరం నుంచి మానస సరోవర్కు భక్తుల్ని చేర్చేందుకు ఉన్న వివిధ మార్గాలపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.