డెహ్రాడూన్: చార్ధామ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ( Kedarnath Temple ) రంగురంగుల కాంతుల్లో దగదగ మెరిసిపోతున్నది. దీపావళి పండుగ సందర్భంగా కేదార్నాథ్ క్షేత్రాన్ని సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. అంతేగాక రేపు ప్రధాని నరేంద్రమోదీ కేదార్నాథ్ను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పటికంటే కొంచెం ఎక్కువగా 800 కిలోల పుష్పాలతో ఆలయాన్ని అలంకరించారు. అదేవిధంగా రంగురంగుల కాంతులను వెదజల్లే లైట్లను ఏర్పాటు చేయడంతో ఆలయం కలర్ఫుల్గా మెరిసిపోతున్నది.