డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ కాంగ్రెస్లోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. తన పీఏ చందన్ సింగ్ జీనా నివాసాల్లో శుక్రవారం ఈడీ దాడులు జరగ్గా.. శనివారం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 2016లో హరీశ్ రావత్ సీఎంగా ఉన్నప్పుడు చందన్ సింగ్ ఆయనకు ఓఎస్డీగా పనిచేశారు. ఆ ఏడాదిలో నియామక పరీక్షల్లో జరిగిన అక్రమాల్లో మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా చందన్ సింగ్ ఇల్లుతో పాటు పలు చోట్ల ఈడీ సోదాలు జరిగాయి.
ఈ దాడుల్లో రూ.32 లక్షల లెక్కలు చూపని నగదు, 200 గ్రాముల బంగారం, లగ్జరీ వాచ్లు అధికారులు గుర్తించారు. చందన్ సింగ్ కుటుంబీకుల బ్యాంకు ఖాతాల్లో రూ.50 లక్షల దాకా నగదును సీజ్ చేశారు. ఈ దాడుల నేపథ్యంలో హరీశ్ రావత్ మాట్లాడుతూ.. తన వల్ల కాంగ్రెస్కు ఇబ్బంది రావొద్దనే పదవులకు రాజీనామా చేశానన్నారు. నియామక పరీక్షల్లో ఆరోపణలు నిజమని తేలితే తనకు కూడా సిగ్గుచేటేనని పేర్కొన్నారు.