డెహ్రాడూన్, మార్చి 17: ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగలింది. మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్ కోడలు అనుకృతి గుసైన్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. వ్యక్తిగత కారణాలతో తాను పార్టీని వీడుతున్నట్టు ఆమె ప్రకటించారు.
ఆమె బీజేపీతో చేరుతారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. కాగా, కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పని చేసిన హరక్ సింగ్ ఆస్తులపై ఇటీవల ఈడీ సోదాలు నిర్వహించింది.