డెహ్రాడూన్: ఉత్తరాఖండలోని జర్నలిస్టులందరికీ ఉచితంగా కరోనా టీకా వేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జర్నలిస్టులు కూడా ఫ్రంట్లైన్ వర్కర్స్ అని సీఎం తీరత్ సింగ్ రావత్ అభివర్ణించారు. ‘మహమ్మారి కొనసాగుతున్న సమయంలో కరోనా గురించి ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందించడంలో రాష్ట్రంలోని జర్నలిస్టులు ఫ్రంట్లైన్ కార్మికుల మాదిరిగా పనిచేశారు. ఇది ప్రభుత్వానికి గణనీయంగా సహాయపడింది’ అని కొనియాడారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టులు, మీడియా సంస్థల ప్రతినిధులకు ఉచితంగా కరోనా టీకాలు వేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్ల కోసం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.