Crime GPT | న్యూఢిల్లీ, మార్చి 18: నేరస్థులను త్వరగా పట్టుకొనేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇప్పుడు క్రైమ్ జీపీటీ అనే సరికొత్త సాంకేతికతను వినియోగిస్తున్నారు. స్టాక్యు టెక్నాలజీస్ రూపొందించిన ఈ కొత్త టెక్నాలజీ సాధనంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్.. నేరస్తులను సత్వరమే గుర్తించి లోపలేస్తున్నది. నేరస్తుల డాటాబేస్ను తనిఖీ చేయడం ద్వారా క్రైమ్ జీపీటీ పనిచేస్తుంది.
ఇది నేరస్థుల ముఖాలను, స్వరాలను గుర్తిస్తుంది. క్రిమినల్ గ్యాంగ్ చర్యలను విశ్లేషిస్తుంది. యూపీ పోలీసుల వద్ద 9 లక్షల మంది నేరస్తుల సమాచారంతో కూడిన డాటాబేస్ ఉన్నది. క్రైమ్ జీపీటీ అనేది త్రినేత్ర అనే మరో సాధనం అప్గ్రేడ్ వర్షన్. నేరస్థులను కనిపెట్టడంలో ఇది సాయం చేస్తున్నది.