జూన్పూర్: విద్యుత్తు సమస్యను ఎదుర్కొంటున్నామని, పరిష్కరించాలంటూ విన్నవిస్తే దానికి సమాధానం దాటేసి ‘జై బజరంగ్బలి’ అని నినాదాలు చేసిన యూపీ విద్యుత్తు శాఖ మంత్రి అరవింద్ కుమార్ శర్మ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సురాపూర్ను సందర్శించిన మంత్రికి స్థానికులు తాము ఎదుర్కొంట్ను విద్యుత్తు సమస్య గురించి విన్నవించారు.
ఈ ప్రాంతంలో కేవలం మూడు గంటలు మాత్రమే విద్యుత్తును సరఫరా చేస్తున్నారని, దీని కారణంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్నామని వారు మంత్రికి తెలిపారు. అయితే దీనికి మంత్రి సమాధానం ఇవ్వకుండా ‘జై బజరంగ్ బలి, బోలియో శంకర్ భగవాన్ కీ జై, జై శ్రీరాం’ అంటూ నినాదాలు చేసి తన కారెక్కి అక్కడి నుంచి తుర్రుమన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో మంత్రి చర్యను పలువురు తప్పుబడుతున్నారు.