లక్నో: ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, శనివారం కన్నుమూసిన కళ్యాణ్ సింగ్( Kalyan Singh )కు అరుదైన గౌరవం ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. అయోధ్యలో రామ జన్మభూమికి వెళ్లే రోడ్డుకు కళ్యాణ్ సింగ్ పేరు పెడుతున్నట్లు యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సోమవారం వెల్లడించారు. అయోధ్యలోనే కాకుండా లక్నో, ప్రయాగ్రాజ్, బులంద్షమర్, అలీగఢ్లలో ఒక్కో రోడ్డుకు కళ్యాణ్ సింగ్ పేరు పెడుతున్నట్లు ఆయన చెప్పారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కళ్యాణ్ సింగ్.. శనివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. యూపీకి రెండుసార్లు సీఎంగా ఉన్న ఆయన.. 1992లో బాబ్రీ మసీదు ఘటన సందర్భంలోనూ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సోమవారం కళ్యాణ్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి.