లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికల వేళ పార్టీలు ఓటర్లకు పోటీపోటీగా తాయిళాలు ప్రకటిస్తున్నాయి. మరోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తున్నది. గురువారం యూపీ ఫిరోజాబాద్లో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. మరోసారి అధికారం ఇస్తే రైతులకు విద్యుత్ బిల్లుల సమస్య లేకుండా చేస్తామన్నారు.
ఈ సందర్భంగా సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్పై విమర్శలు గుప్పించారు. ఎస్పీ అంటే కేవలం సమావాదీలో ‘ఎస్’ సంపతి (ఆస్తి) కూడబెట్టడం, ‘పీ’ అంటే రాష్ట్రంలోర పరివార్వాద్ (రాజవంశ రాజకీయాలు)ను ప్రోత్సహించడం అని విమర్శించారు. పన్ను వసూలు చేసి విదేశీ విహారయాత్రకు వెళ్లడమే అఖిలేశ్ నినాదం అని.. పన్నులు వసూలు చేసి పేదల కోసం అమలు చేయడం బీజేపీ విధానమన్నారు.