కన్నౌజ్, ఏప్రిల్ 30: ఉత్తరప్రదేశ్లో ఓ చెత్తకుప్పలో కరోనా వ్యాక్సిన్లు బయటపడ్డాయి. కన్నౌజ్లోని ఓ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సమీపంలో ఉన్న చెత్తకుప్పలో కొవిషీల్డ్ వ్యాక్సిన్లు బయటపడటంతో అధికారులు విచారణకు ఆదేశించారు.
టీకాలను ఉపయోగించకుండా ఇలా చెత్తకుప్పలో పడేయడం తీవ్రమైన విషయమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు స్థానికులు స్పందిస్తూ తాము రెండో డోసు తీసుకోకపోయినా తీసుకున్నట్టు మెసేజ్లు వస్తున్నాయని, టీకాలను చెత్తకుప్పలో పడేసి రికార్డుల్లో వ్యక్తులకు ఇచ్చినట్టు రాస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు.