లక్నో : ఉత్తరప్రదేశ్లో పోలీస్శాఖ సోషల్ మీడియా విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. పోలీసు అధికారులు డ్యూటీ సమయంలో సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించింది. కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకు తప్పనిసరిగా ఆదేశాలను పాటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
యూనిఫాంలో రీల్స్ చేయడం, యూనిఫాంలో ఉన్న సమయంలో పని సమయంలో ఎలాంటి కారణం లేకుండా చాటింగ్, ఫొటోగ్రాఫ్లు పోస్ట్ చేయడంపై సైతం నిషేధం విధించారు. అయితే, ఈ విధానాన్ని అమలు చేయడానికి ముందు వివిధ సంస్థలతో ఉత్తరప్రదేశ్లో అభిప్రాయ సేకరణ చేసింది. అలాగే విదేశాల్లో అమలులో ఉన్న నిబంధనలపై అధ్యయనం నిర్వహించింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా జిల్లా స్థాయిలో సీనియర్గా తీసుకొని పాటించాలని ఆదేశించారు.