Joe Biden | వచ్చే ఏడాది జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కావడం లేదని తెలుస్తున్నది. జనవరిలో జరుగనున్న క్వాడ్ లీడర్స్ సమ్మిట్ను నిర్వహణలో భాగంగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు భారత్ ఆహ్వానించింది. క్వాడ్ లీడర్స్ భేటీని సైతం 2024 చివరలో నిర్వహించాలని ప్రతిపాదించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
క్వాడ్ సదస్సుకు సంబంధించిన తేదీలను సవరించాలని భావిస్తున్నామని, ప్రతిపాదిత తేదీల్లో అన్ని భాగస్వామ్య దేశాలు సదస్సుల్లో పాల్గొనే అవకాశం లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మే నెలలో జపాన్లోని హిరోషిమాలో జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత జరుగబోయే క్వాడ్ లీడర్స్ సమ్మిట్కు భారత ఆతిథ్యం ఇవ్వనుందని ప్రకటించారు. క్వాడ్లో భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ ఉన్నాయి.