న్యూఢిల్లీ, ఆగస్టు 31: భారత వైమానిక దళానికి అవసరమైన ఫైటర్ జెట్ ఇంజిన్లను తయారు చేసేందుకు భారత్కు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు జీఈ ఏరోస్పేస్తో ఒప్పందానికి అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) అంగీకరించింది. ఈ విషయమై జూన్లో ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి.
అమెరికా కాంగ్రెస్ ఆమోదంతో భారత్తో కలిసి జీఈ ఏరోస్పేస్ పని చేయడానికి మార్గం సుగమమైంది. జెట్ ఇంజిన్ల టెక్నాలజీని ఇరు దేశాలు బదిలీ, భారత్లో హెచ్ఏఎల్ ఆధ్వర్యంలో ఎఫ్414 ఫైటర్ జెట్ ఇంజిన్ల తయారీ జరుగుతుంది. ఈ ఒప్పందంతో ఈ రంగంలో అనూహ్య మార్పు సంభవిస్తుందని, భవిష్యత్లో జెట్లను మనమే తయారు చేసుకునే సామర్థ్యం లభిస్తుందని హెచ్ఏఎల్ చీఫ్ సీబీ అనంతకృష్ణన్ తెలిపారు.