న్యూఢిల్లీ : యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. జూన్ 5న ఎగ్జామ్ నిర్వహించగా, 17 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు. 13,090 మంది అభ్యర్థులు మెయిన్స్ కు క్వాలిఫై అయినట్లు యూపీఎస్సీ అధికారులు ప్రకటించారు. సివిల్స్ ప్రిలిమ్స్కు 11.52 లక్షల మంది దరఖాస్తు చేసుకుని పరీక్షకు హాజరయ్యారు. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ సర్వీసుల కోసం అభ్యర్థులను ప్రతి ఏడాది యూపీఎస్సీ ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రిలిమినరీ ఫలితాల కోసం www.upsc.gov.in అనే వెబ్సైట్ను సందర్శించొచ్చు.