(Longest runway) లక్నో : అతి పొడవైన విమాన రన్వే ప్రారంభానికి సిద్ధమైంది. ఈ రన్ వే ఉత్తరప్రదేశ్లోని ఘోరక్పూర్ పరిధిలోని కుషీనగర్లో నిర్మించారు. ఈ అంతర్జాతీయ రన్వేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 20 న ప్రారంభించనున్నారు. గౌతమ బుద్ధుడు మహాపరి నిర్వాణం పొందిన ప్రదేశంగా కుషీనగర్ ప్రసిద్ధికెక్కింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మూడవ అంతర్జాతీయ విమానాశ్రయం అయిన కుషీనగర్.. ఇప్పుడు అతి పొడవైన రన్ వే ఉన్న విమానాశ్రయంగా కొత్త రికార్డు స్థాపించింది.
శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స విమానం ఇక్కడ దిగే తొలి విమానం. ఆయన వెంట 25 మంది సభ్యుల బృందం, వంద మంది బౌద్ధ సన్యాసులు రానున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వివిధ దేశాల రాయబారులను కూడా ఆహ్వానించారు. ప్రధాని మోదీతోపాటు విదేశాల నుంచి వచ్చే అతిథులు కూడా బుద్ధుడి మహాపరి నిర్వాణ ప్రదేశాన్ని సందర్శిస్తారు. ఇదే సమయంలో మూడు రోజుల అంతర్జాతీయ బౌద్ధ సమ్మేళనాన్ని కూడా ప్రారంభించనున్నారు.
కుషీనగర్లో 650 ఎకరాల్లో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం అతి పొడవైన రన్వేను కలిగి ఉన్నది. దీని పొడవు 3.2 కిలోమీటర్లు, వెడల్పు 45 మీటర్లు. ఈ రన్వే సామర్థ్యం గంటకు 8 విమానాలు. పగటిపూట కాకుండా రాత్రిపూట కూడా ఇక్కడి నుంచి ప్రయాణించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడి తాత్కాలిక ప్యాసింజర్ టర్మినల్ భవనం 3,600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మధ్య 2019 మార్చి 5 న ఒప్పందం కుదిరింది.
కొవిడ్ సమస్యలతో కొలిన్ పావెల్ కన్నుమూత
జమ్ములో ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె పర్యటన
చెమటతో రక్తంలో చక్కెరను కనిపెట్టొచ్చు.. డివైజ్ సిద్ధం చేసిన అమెరికన్ శాస్త్రవేత్తలు
వచ్చే ఏడాది ఐటీలో భారీగా కొలువులు
దీపావళి పండుగ ఆఫర్లు ప్రకటించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా
పడిపోయిన బైడెన్పై ప్రజల్లో విశ్వాసం.. కారణమిదేనా?
సూరత్ ప్యాకేజింగ్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం, ఇద్దరు మృతి
రైతు ఉద్యమం ముగింపునకు గవర్నర్ కొత్త సలహా.. ఏంటంటే?
బెనజీర్ భుట్టో కాన్వాయిపై ఆత్మాహుతి దాడి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..