అగర్తలా, జూలై 7: త్రిపుర అసెంబ్లీలో అశ్లీల వీడియోను చూస్తూ పట్టుబడిన బీజేపీ ఎమ్మెల్యే జబాద్ లాల్ నాథ్పై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష సభ్యులు శుక్రవారం డిమాండ్ చేశారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొన్నది. సభ ప్రారంభంకాగానే ఈ అంశాన్ని ప్రతిపక్ష నేత అనిమేశ్ దేబర్మ ప్రస్తావించారు.
స్పందించిన స్పీకర్ తర్వాత చూద్దామని అనడంతో ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఐదుగురు ప్రతిపక్ష సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.