EPFO | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: అధిక వేతనాలపై పెన్షన్కు సంబంధించి ఉద్యోగుల జీతాల వివరాల అప్లోడింగ్ కోసం కంపెనీలకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) మరో మూడు నెలలు వెసులుబాటు కల్పించింది. డిసెంబర్ 31దాకా గడువు ఇచ్చింది. నిజానికి ఈ నెలాఖరుతోనే గడువు ముగిసిపోతున్నది.
అయితే కంపెనీలు, ఆయా సంస్థల ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులతో ఈ ఏడాది ఆఖరుదాకా సమయమిస్తున్నట్టు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం నాటికి ఇంకా 5.52 లక్షల దరఖాస్తులు.. వ్యాలిడేషన్ ఆప్షన్/జాయింట్ ఆప్షన్ల కోసం పెండింగ్లో ఉన్నాయని కార్మిక మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా వెల్లడించింది. అందువల్లే సంస్థలు, ఆ కంపెనీల్లోని ఉద్యోగ సంఘాల అభ్యర్థనల్ని పరిగణనలోకి తీసుకుని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చైర్మన్ గడువును పొడిగించారని పేర్కొన్నది.