పాట్నా, ఫిబ్రవరి 19: జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీశ్కుమార్పై ఇటీవల విమర్శలు చేస్తున్న పార్టీ పార్లమెంటరీ బోర్డు చైర్మన్ ఉపేంద్ర కుష్వాహా జేడీయూను వీడనున్నట్టు సమాచారం. గతంలో జేడీయూను విలీనం చేసిన తన పార్టీ రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ)ని పునరుద్ధరించే అవకాశాలున్నటు భావిస్తున్నారు. అలాగే ఆయన బీజేపీతో కలిసే అవకాశాలను కూడా కొట్టి పారేయలేమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.
2025లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘటబంధన్కు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ నాయకత్వం వహిస్తారని ఇటీవల నితీశ్ చేసిన ప్రకటన కూడా ఉపేంద్ర అసంతృప్తికి కారణంగా భావిస్తున్నారు. ఇప్పటికే కుష్వాహా పలుసార్లు తమ కూటమిలోకి రావడం, వెళ్లడం పట్ల నితీశ్కుమార్ పలుసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన జేడీయూని వీడినా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టంచేశారు.