లక్నో: లైంగిక దాడి అనంతరం అధిక రక్తస్రావం వల్ల విద్యార్థిని మరణించింది. కాగా, లైంగిక దాడికి ముందు తాను రెండు ఎనర్జీ పిల్స్ తీసుకున్నట్లు నిందితుడు పోలీసులకు వెల్లడించాడు. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. డిగ్రీ రెండో ఏడాది చదువుతున్న యువతి ఇంట్లో ఒంటరిగా ఉండగా ఆమె బాయ్ఫ్రెండ్ అక్కడకు వెళ్లాడు. ఆమె నిరాకరించినప్పటికీ బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె ప్రైవేట్ భాగాల నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో అతడు భయపడి అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, ఆ యువతి అచేతనంగా పడి ఉండటాన్ని ఇంటికి తిరిగి వచ్చిన సోదరి గమనించింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోస్ట్మార్టం నిర్వహించగా తీవ్రమైన లైంగిక దాడి, అధిక రక్తస్రావం వల్ల ఆమె మరణించినట్లు తేలింది.
మరోవైపు ఆ యువతి తండ్రి 28 ఏళ్ల పొరుగింటి వ్యక్తి, 65 ఏళ్ల వృద్ధురాలిపై అనుమానం వ్యక్తం చేశాడు. అయితే మరణించిన యువతి మొబైల్ ఫోన్ ద్వారా నిందితుడ్ని పోలీసులు గుర్తించారు. ఒంటరిగా ఉన్న ఆమె ఇంటికి వస్తానంటూ 28 ఏళ్ల రాజ్ గౌతమ్ చాట్ చేయడాన్ని గమనించారు. దీంతో ఆదివారం అతడ్ని అరెస్ట్ చేశారు.
కాగా, గౌతమ్ను పోలీసులు ప్రశ్నించగా ఆ యువతి మరణానికి తానే కారణమని ఒప్పుకున్నాడు. లైంగిక దాడికి ముందు రెండు ఎనర్జీ పిల్స్ తీసుకున్నట్లు తెలిపాడు. తీవ్ర రక్తస్రావం అవుతున్నప్పటికీ లైంగిక దాడిని కొనసాగించడంతో ఆమె అపస్మారక స్థితికి చేరిందని, దీంతో భయంతో అక్కడి నుంచి పారిపోయినట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలో గౌతమ్ను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.