లక్నో: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ప్రతిష్ఠాత్మక రామ్ వన్ గమన్ పథ్ ప్రాజెక్ట్లో ప్రారంభోత్సవానికి ముందే పగుళ్లు ఏర్పడ్డాయి. శ్రింగవెర్పూర్ ధామ్ వద్ద పలు ప్రదేశాల్లో ఈ రోడ్డు కుంగిపోయింది. లక్నో-గంగా వంతెన మధ్యలో 100 మీటర్ల పరిధిలో నాలుగు చోట్ల ఈ రోడ్డుకు పగుళ్లు ఏర్పడటంతో ఆ మార్గంలో ట్రాఫిక్ను నిలిపేశారు. వానాకాలంలో ఈ నష్టం జరగడంతో నిర్మాణ నాణ్యతపై, ప్రభుత్వ పర్యవేక్షణపై ఆందోళన వ్యక్తమైంది. వచ్చే నెలలో ఈ రోడ్డును రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించాల్సి ఉంది.
రోడ్డుపై పగుళ్లు స్పష్టంగా కనిపిస్తుండంతో స్థానికులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. దీనిపై సాంకేతిక మదిం పు చేయాలని కోరారు. అయోధ్య-చిత్రకూ ట్ మధ్య సుమారు 210 కిలోమీటర్ల మేర రామ్ వన్ గమన్ పథ్ను నిర్మించారు. ముఖ్యమైన ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాంతాలను కలిపేలా దీన్ని రూపొందించారు. పగుళ్లపై ఎన్హెచ్ఏఐ కార్యనిర్వాహక ఇంజినీర్ స్పందిస్తూ… వర్షం వల్ల ఈ నష్టం జరిగిందని.. త్వరలోనే ప్రభావిత సెక్షన్లో మరమ్మతులు చేస్తామని తెలిపారు.