చందౌలీ, మే 2: ఉత్తరప్రదేశ్లోని మన్రాజ్పూర్ గ్రామానికి చెందిన నిషా వయస్సు 21 ఏండ్లు. అమె తండ్రి కన్హయ్యను అరెస్టు చేయాలంటూ ఆదివారం సాయంత్రం పోలీసులు వాళ్లింటికి వచ్చారు. కన్హయ్య ఇంట్లో లేడు. అతని కొడుకును తీసుకెళ్లడానికి పోలీసులు యత్నించారు. నిషా అడ్డగించారు. సోదరుణ్ని తీసుకెళ్లవద్దని పోలీసులను వేడుకొన్నారు. విచక్షణ కోల్పోయిన పోలీసులు ఆమెను విపరీతంగా కొట్టారు. దెబ్బలు భరించలేక ఆమె సాయం కోసం అరిచారు. ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకోవడానికి ప్రయత్నించారు. కానీ పోలీసులు నిషాను వెంబడించారు. మళ్లీ కొట్టారు. పోలీసుల దెబ్బలతో యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
పోలీసులు నిషాను కొడుతున్న వీడియో వైరల్ అయింది. అయితే, అదే సాయంత్రం నిషా చనిపోయినట్టు ఆమె చెల్లెలు వెల్లడించారు. పోలీసులపై ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు. కన్హయ్య లేకపోవడంతో తిరిగొ చ్చామని, నిషా ఆత్మహత్య చేసుకొని ఉంటారని పేర్కొన్నారు. నిషా మృతి యూపీని కుదిపివేసింది. పలు చోట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఎస్హెచ్వోను సస్పెండ్ చేశారు.