UP Polls | ఓబీసీ వర్గానికి చెందిన నేతలు బీజేపీని వీడినంత మాత్రాన వచ్చిన నష్టమేమీ లేదని యూపీ డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య అన్నారు. యూపీలోని వర్గాలన్నీ ప్రధాని మోదీపై అచంచల విశ్వాసాన్ని కలిగి వున్నాయని స్పష్టం చేశారు. వారందరూ తమ వ్యక్తిత ప్రయోజనాల కోసమే పార్టీలు మారారని, సిద్ధాంతం కోసం కాదని విమర్శించారు. 2019 లో లాగా మార్చి 10న తుది ఫలితాలు వెలువడిన తర్వాత ఎవరూ కనిపించరన్నారు. బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం యూపీ ప్రజలకు ఎంతగానో చేసిందని, అన్ని కులాల మిశ్రమం ప్రధాని మోదీ ధృక్కోణంలో ఉందని పేర్కొన్నారు. స్వామి ప్రసాద్ మౌర్య, ధరంసింగ్ సైనీ బీజేపీకి రాజీనామా చేశారు. వీరిద్దరూ సమాజ్వాదీ పార్టీలో చేరారు. వీరితో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి గుడ్బై చెప్పి, సమాజ్వాదీలో చేరిపోయారు.