లక్నో : యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కుమారుడు యోగేష్ కుమార్ మౌర్య ప్రయాణిస్తున్న వాహనం శనివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదానికి గురైంది. జలౌన్ జిల్లా ఆలంపూర్ బైపాస్ సమీపంలో ఈ ఘటన జరిగింది. యోగేష్ మౌర్య ప్రయాణిస్తున్న కారు ట్రాక్టర్ను ఢీ కొట్టింది.
ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. కాగా ఈ ప్రమాదం నుంచి యోగేష్ మౌర్య సురక్షితంగా బయటపడ్డారని, ఆయన కారు స్వల్పంగా దెబ్బతిన్నదని ఎస్పీ రవికుమార్ చెప్పారు. రోడ్డు ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. కాగా యూపీ డిప్యూటీ సీఎంగా కేశవ్ ప్రసాద్ మౌర్య శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.