లక్నో: మాజీ ఎంపీ, బీజేపీ నేత జయప్రదకు యూపీలోని రాంపూర్లో ఉన్న ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు సోమవారం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలకు సంబంధించిన కేసులో ఈ చర్య తీసుకుంది. వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించినప్పటికీ ఆమె హాజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.