లక్నో : అనుమానంతో తల్లిదండ్రులు కన్న కూతురు గొంతుకోసి హత్య చేశారు. ఆచూకీ తెలియకుండా యాసిడ్ పోసి.. మృతదేహాన్ని పడేశారు. ఆ తర్వాత తమ కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్లోని కౌశాంబిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలమాబాద్కు చెందిన నరేశ్ ఈ నెల 3న తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే గ్రామ శివారులో ఉన్న కాలువలో యువతి మృతదేహాన్ని పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు.
ఆ తర్వాత తల్లిదండ్రుల వ్యవహారంపై అనుమానం వచ్చిన పోలీసులు వారిని విచారించగా.. విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 3న యువతి తల్లిదండ్రులు నరేశ్, అతని భార్య శోభాదేవి ఇంట్లోనే కూతురు గొంతుకోసి హత్య చేసినట్లు ఎస్పీ బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ బుధవారం తెలిపారు. మృతురాలి గుర్తింపును దాచేందుకు శరీరంపై బ్యాటరీలోని యాసిడ్ పోశారన్నారు. మృతదేహాన్ని దాచేందుకు నరేశ్కు అతని సోదరులు రమేశ్, గులాబ్ సహకరించారన్నారు. అయితే, యువతి తరుచూ ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతుండేదని, దీంతో కూతురిపై అనుమానం భార్యాభర్తలకు అనుమానం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కూతురికి ఎవరితోనే సంబంధం ఉందని, అంతే కాకుండా యువతి నుంచి ప్రెగ్నెసీ టెస్ట్ కిట్లు దొరకడంతో అనుమానం పెరిగి హత్యకు పాల్పడినట్లు పోలీసులు వివరించారు. హత్య కేసులో మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు.