Loksabha Elections 2024 : యూపీలో ఎస్పీ, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ప్రతిసారీ ఉగ్ర దాడులు పెచ్చుమీరుతాయని యూపీ సీఎం యోగి ఆదిత్యా నాథ్ అన్నారు. ఎస్పీ హయాంలో అయోధ్యలోని రామాలయం, కాశీలో సంకట్ మోచన్ ఆలయాలపై దాడులు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.
సీఎంగా అఖిలేష్ యాదవ్ మొట్టమొదట ఉగ్రవాదులపై కేసులు ఉపసంహరించారని, అదృష్టవశాత్తూ ఈ వ్యవహారంలో న్యాయస్ధానం జోక్యం చేసుకుందని వివరించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యోగి ఆదిత్యానాథ్ శుక్రవారం దియోరియాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో అన్ని వర్గాల అభ్యున్నతికీ చర్యలు చేపడుతున్నామని చెప్పారు. మోదీ ప్రభుత్వ హయాంలో అందరికీ భద్రత, ప్రతి ఒక్కరికీ గౌరవం, అభివృద్ధి, పేదల సంక్షేమం ప్రాధాన్యతలుగా ముందుకు సాగుతున్నామని అన్నారు.
Read More :