BJP Wins Rampur | ఉత్తరప్రదేశ్లో రాంపూర్ లోక్సభ స్థానం ఇప్పటివరకు సమాజ్వాదీ పార్టీ నేత ఆజంఖాన్ కంచుకోట. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. తొలిసారి బీజేపీ విజయం సాధించింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆజంఖాన్.. తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో రాంపూర్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఘన్శ్యామ్ సింగ్ లోధీ ఘన విజయం సాధించారు. రాంపూర్ నుంచి ఎస్పీ అభ్యర్థిగా అసిం రాజాను బరిలో నిలిపారు. ఈ ఉప ఎన్నికలో మాయావతి సారధ్యంలోని బీఎస్పీ పోటీ చేయలేదు. బీజేపీ అభ్యర్థి ఘన్శ్యామ్ సింగ్ లోధీ 37,707 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఘన్శ్యామ్ సింగ్ లోధీ ఇటీవలే బీజేపీలో చేరడం గమనార్హం.
ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి ఘన్శ్యామ్ సింగ్ లోధీ విజయం సాధించారు. ఈ విజయాన్ని రాత్రింబవళ్లు పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. రాంపూర్ వాసులకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ ఎల్లవేళలా ప్రజల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.
`చరిత్ర సృష్టిస్తున్నాం. రాంపూర్ లోక్సభ ఉప ఎన్నికల్లో 37,797 ఓట్ల మెజారిటీతో బీజేపీ విజయం సాధించింది. ఆజంగఢ్లోనూ విజయం సాధిస్తున్నాం. మతతత్వ, విభజన, మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలకు చెంపపెట్టు. ప్రధాని నరేంద్రమోదీ సారధ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అమలు చేస్తున్న వికాస రాజకీయాలకు లభించిన తీర్పు ఇది` అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ చెప్పారు.