లక్నో: ఉత్తరప్రదేశ్లో అధికార బీజేపీ ఘన విజయం సాధించింది. మునుపటి కంటే ఓ 40 స్థానాలు తగ్గినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే సుమారు 70 స్థానాలు అధికంగానే సాధించింది. లఖింపూర్ ఖేరీ ఘటన, వ్యవసాయ చట్టాలు, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా.. చివరికి యోగీ మాయాజాలమే పనిచేసింది.
యోగీ ఆదిత్యనాథ్ ఒక ముఖ్యమంత్రిగా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే కాకుండా తాను వ్యక్తిగతంగా కూడా ఘన విజయం సాధించారు. గోరఖ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన యోగీ ఏకంగా లక్ష ఓట్లకుపైగా మెజారిటీతో గెలిచారు.