ఉన్నావ్ (యూపీ): ఉత్తరప్రదేశ్లో మాఫియాను లేకుండా చేస్తానని.. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతుంటారు. కానీ గ్యాంగ్రేప్నకు గురైన దళిత బాలిక ఇంటిని నిందితులు తగలబెడితే మాత్రం ఆయన చేతులు ముడుచుకొని కూర్చొన్నారు. గత ఏడాది దళిత బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు.
ఈ నేరంలో బెయిల్పై బయటికి వచ్చిన దోషులు కోపంతో మరి కొందరితో కలిసి సోమవారం బాధితురాలి ఇంటిపై దాడి చేసి ఆమె తల్లిని కొట్టారు. అనంతరం ఇంటికి నిప్పుపెట్టారు. దీంతో బాధితురాలికి జన్మించిన బాబుతోపాటు మరో చిన్నారికి గాయాలయ్యాయి. ఇంత జరిగినా యోగి సర్కార్ మాత్రం నిందితులను ఇప్పటి వరకు పట్టుకోలేదు.