పట్నా : బిహార్లోని (Bihar) కిషన్గంజ్ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని కొచధమన్ పోలీస్స్టేషన్ పరిధిలోని మస్తాన్ చౌక్ సమీపంలోని రెండు ఆలయాలకు గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో భజ్రంగ్బలి ఆలయం పాక్షికంగా ధ్వంసం కాగా, దుర్గామాత ఆలయం పూర్తిగా దగ్ధమైంది. ఇరు ఆలయాల మధ్యన బజరంగ్ అనే వ్యక్తికి చెందిన షాపు, భజరంగ్బలి ఆలయ పూజారి మదన్ లాల్ ఇల్లు ఆగ్నికి ఆహుతయ్యాయి.
ఈ ఘటన అనంతరం స్ధానికులు ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చి నిరసన చేపట్టారు. ఆలయాలను దగ్ధం చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఘటనా స్ధలానికి చేరుకున్న జిల్లా అధికారులు ఆందోళనకారులను శాంతింపచేసి ట్రాఫిక్ను పునరుద్ధరింపచేశారు. ఈ ప్రాంతంలో శాంతికి భగ్నం కలిగించాలనే దుండగులు ఆలయాల ధ్వంసానికి పూనుకున్నారని స్ధానికులు పేర్కొన్నారు.
ఘటనపై సిట్ ఏర్పాటు చేసి నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించమని మేజిస్ట్రేట్ స్పష్టం చేశారు.
Read More :
Jay Shetty | డిగ్రీ అవ్వగానే సన్యాసం తీసుకున్నాడు.. ఇప్పుడు ప్రేమ పాఠాలు చెబుతున్నాడు
Indonesia | ఇండోనేషియాలో మౌంట్ మెరాపీ అగ్నిపర్వత విస్ఫోటనం