న్యూయార్క్: భారత్లో జరిగే లోక్సభ ఎన్నికలు.. స్వేచ్ఛగా, న్యాయబద్దంగా జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి(United Nations) ప్రధాన కార్యదర్శి ప్రతినిధి స్టిఫేన్ డుజారిక్ తెలిపారు. భారత్లో అయినా, మరో దేశంలో అయినా ఎన్నికలు జరిగితే, అక్కడ ప్రజల రాజకీయ, పౌర హక్కుల్ని రక్షించాల్సి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా, న్యాయబద్దంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారత్లో రాజకీయ అనిశ్చితి నెలకొన్నట్లు ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు స్టిఫేన్ డుజారిక్ బదులు ఇస్తూ ఆ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు, కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లు సీజ్ లాంటి అంశాలపై ఇటీవల అమెరికాతో పాటు జర్మనీ దేశాలు కూడా స్పందించిన విషయం తెలిసిందే. కేజ్రీ అరెస్టుపై అమెరికా కామెంట్ చేసిన నేపథ్యంలో ఆ దేశ ప్రతినిధి మాథ్యూ మిల్లర్కు సమన్లు కూడా జారీ చేశారు.