బెంగుళూరు : కేంద్ర మంత్రి శోభా కరండలేజ్(Shobha Karandlaje) తమిళనాడు ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఇటీవల బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్లో బ్లాస్ట్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ కేఫ్లో పేలుడుకు పాల్పడింది కృష్ణగిరి ఫారెస్ట్లో శిక్షణ పొందిన వ్యక్తి అని మంత్రి శోభ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెబుతున్నట్లు ఆమె వెల్లడించారు. తన ఎక్స్ అకౌంట్లో ఆమె ఆ ట్వీట్ చేశారు. తమిళ సోదరులు, సిస్టర్స్కు ఓ విషయాన్ని క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నామని, తాను సదుద్దేశంతో కొన్ని వ్యాఖ్యలు చేశామనని, కానీ ఆ వ్యాఖ్యలు కొందరికి బాధను కలిగించాయని, రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్తో లింకున్న వ్యక్తి కృష్ణగిరి ఫారెస్ట్లో శిక్షణ పొందినట్లు ఆమె వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలతో తమిళనాడు ప్రజలు ఎవరైనా బాధపడితే, తన గుండెల లోతు నుంచి క్షమాపణలు చెబుతున్నానని, ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి చెప్పారు.తమిళనాడు సీఎం స్టాలిన్పై కేంద్ర మంత్రి ఫైర్ అయ్యారు. హిందువులు, బీజేపీ వర్కర్లను టార్గెట్ చేసే విధంగా రాడికల్స్ ను సీఎం ప్రోత్సహిస్తున్నట్లు ఆమె ఆరోపించారు.
To my Tamil brothers & sisters,
I wish to clarify that my words were meant to shine light, not cast shadows. Yet I see that my remarks brought pain to some – and for that, I apologize. My remarks were solely directed towards those trained in the Krishnagiri forest,
1/2— Shobha Karandlaje (Modi Ka Parivar) (@ShobhaBJP) March 19, 2024