న్యూఢిల్లీ, ఆగస్టు 10: రిజర్వ్ బ్యాంక్, సెబీల మాదిరిగా డాటా ప్రొటెక్షన్ బోర్డు (డీపీబీ) నియంత్రణ వ్యవస్థలా పనిచేయదని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. పౌరుల డాటా గోప్యతను కాపాడేందుకు ఈ నెల 9న రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం డాటా ప్రొటక్షన్ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే.
ఈ బిల్లు ప్రకారం పౌరుల డాటాను పరిరక్షించే బాధ్యత డాటా ప్రొటెక్షన్ బోర్డుపై ఉంటుంది.అయితే ఈ బోర్డు స్వతంత్ర వ్యవస్థా కాదా అన్న అంశం అప్రస్తుతమని, ఆర్బీఐ, సెబీల్లా నియంత్రణ వ్యవస్థగా ఇది వ్యవహరించదని కేంద్రమంత్రి తెలిపారు.