న్యూఢిల్లీ, నవంబర్ 9: పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూలు ఖరారైంది. డిసెంబర్ 4 నుంచి 22 వరకు ఈ సమావేశాలు జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం ఎక్స్లో తెలిపారు. 19 రోజుల్లో 15 సెషన్లలో సమావేశాలు సాగుతాయన్నారు.
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా వివాదానికి సంబంధించి ఎథిక్స్ కమిటీ నివేదిక, ఐపీసీ స్థానంలో తెచ్చిన మూడు బిల్లులపై స్టాండింగ్ కమిటీ నివేదికలు, ఇతర అంశాలను లోక్సభలో ప్రవేశపెడతామన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి పెండింగ్లో ఉన్న బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే పరిశీలిస్తారని మంత్రి తెలిపారు.