రొమానియా నుంచి భారతీయులను తీసుకొచ్చిన తొలి విమానం ముంబై ఎయిర్ పోర్టుకు సురక్షితంగా చేరుకుంది. ఇందులో 219 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరందరూ ముంబై ఎయిర్పోర్ట్కు సురక్షితంగా చేరుకున్నారు. వీరికి కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారతీయ విద్యార్థులు ఆయనతో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ మాట్లాడుతూ…
‘ఉక్రెయిన్లో సంక్షోభం తలెత్తిన సమయం నుంచే అక్కడి భారతీయులను సురక్షితంగా భారత్కు చేర్చడం అన్న ఏకైక లక్ష్యంగానే ముందుకు సాగాం. ఇప్పటికి 219 మంది విద్యార్థులు ముంబైకి చేరుకున్నారు. మాతృభూమికి స్వాగతం పలుకుతున్నాం. ఇది మొదటి బ్యాచ్. రెండో బ్యాచ్ కూడా ఢిల్లీకి తొందర్లోనే చేరుకుంటుంది. ఉక్రెయిన్లోని భారతీయులందర్నీ తిరిగి రప్పించేంత వరకూ ఇది కొనసాగుతూనే వుంటుంది’ అని పీయూశ్ గోయల్ స్పష్టం చేశారు.
ఇక ఇదే విషయంపై ముంబై మేయర్ కిశోరీ పెడ్నేకర్ కూడా స్పందించారు. మాతృభూమికి వచ్చినవారందరూ మన పిల్లలే. మాతృభూమికి వచ్చేశారు. వారందరికీ ముంబై బృహ్మన్ పాలిక పక్షాన అన్న ఏర్పాట్లు చేశాం. వారు ఎక్కడికి వెళ్లాలన్నా, వారి అవసరాల కోసమైనా… అయ్యే ఖర్చులను మేమే భరిస్తాం అని ముంబై మేయర్ కిశీరో పెడ్నేకర్ ప్రకటించారు.
ఇక విమానయాన సిబ్బంది కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. భారతీయులను సురక్షితంగా తీసుకురావడం తమకెంతో సంతోషాన్నిచ్చిందని ప్రకటించారు. మాతృభూమికి చేరుకోగానే వారందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇంతటి అవకాశం కల్పించిన భారత ప్రభుత్వానికి తాము ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎయిరిండియా సిబ్బంది తెలిపారు.