Nitin Gadkari | సికార్: వచ్చే ఎన్నికల్లో తాను ఎలాంటి పోస్టర్లు, బ్యానర్లు వేయించనని, ప్రజలు తన సేవను, చేసిన పనిని చూసే ఓట్లు వేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరి పేర్కొన్నారు. సోమవారం రాజస్థాన్లోని ఓ కార్యక్రమానికి హాజరైన గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను వచ్చే ఎన్నికల్లో పోస్టర్లు, బ్యానర్లు వేయించొద్దని నిర్ణయించుకున్నాను.
ఎవరికీ ఛాయ్ తాగించడం వంటివి కూడా చేయను. ఓటు వేయాలనుకునే వారు వేస్తారు. వేయొద్దనుకునే వారు వేయరు. చేసిన సేవ, అభివృద్ధి, పేదల సంక్షేమం, ఆరోగ్య వసతులు కల్పించడం, యువతకు ఉపాధి, పిల్లలకు మంచి విద్యను అందించడం ద్వారానే ఓట్లు వస్తాయి’ అని నితిన్ గడ్కరి పేర్కొన్నారు.