న్యూఢిల్లీ : బీజేపీ అధిష్ఠానం తీరుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, దాంతో రాజకీయాల నుంచి వైదొలగుతారని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజకీయం అంటే కేవలం అధికారం అనుభవించడం కాదన్నారు. వీటి గురించి మాట్లాడుతుంటే తాను రాజకీయాలకు గుడ్బై చెబుతున్నానంటూ రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయాలను వదిలిపెడతానని ప్రకటించలేదని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటరీ బోర్డు కమిటీలో స్థానం కల్పించకపోవడాన్ని ప్రస్తావిస్తూ తాను ఒక నమ్మకానికి, సిద్ధాంతానికి కట్టుబడిన కార్యకర్తనని, ఇందులో నిరాశ చెందడానికి ఏమీ లేదని పార్టీ తనకు అప్పగించిన ఏ పనినైనా చిత్తశుద్ధితో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తానని తెలిపారు.