ముంబై: ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయారు. మహారాష్ట్రలోని యావత్మాల్లో మంగళవారం మధ్యాహ్నం జరిగిందీ ఘటన. వెంటనే అప్రమత్తమైన మిగతా నేతలు ఆయనకు సపర్యలు చేయడంతో కాసేపటికి కోలుకుని తిరిగి ప్రసంగాన్ని కొనసాగించారు.
ప్రసంగం పూర్తిచేసిన తర్వాత ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ర్యాలీలో ఎండవేడిమి కారణంగా కొంత అసౌకర్యంగా అనిపించిందని పేర్కొన్నారు.