పుణే: వీఐపీ వాహనాల సైరన్ స్థానంలో భారతీయ సంగీత ధ్వనులు తీసుకొస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. వాహనాల నుంచి వెలువడే శబ్ద కాలుష్యాన్ని నియంత్రించాలన్న ఉద్దేశంతో కేంద్రం సరికొత్త పాలసీని తీసుకురానున్నదని అన్నారు.
వీఐపీ వాహనాల సైరన్ స్థానంలో పిల్లనగ్రోవి, తబలా, శంఖం.. మొదలైన భారతీయ సంగీత వాయిద్యాల ద్వారా రూపొందించిన సంగీతాన్ని తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నామని అన్నారు. పుణేలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.